- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ వెబ్ డెస్క్: తమ పార్టీ నేతలపై పెట్టిన కేసులను మరచి పోబోమని, దానికి వడ్డీతో సహా చెల్లిస్తామని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. మాజీ మంత్రి కొల్లు నారాయణను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. 16 నెలలుగా అధికారంలో వైసీపీ ఉందన్నారు. కానీ టీడీపీ హయాంలో అవినీతి జరిగినట్టు వైసీపీ ఒక్క ఆధారం చూపించ లేకపోయిందన్నారు. ఒక మతంపై దాడి జరిగినప్పుడు సీబీఐ విచారణ జరగాల్సిందేనన్నారు. ఈ కేసలో వరస ఘటనలు చూస్తుంటే కుట్రకోణం స్పష్టమవుతోందన్నారు.
ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమకేసులు లేదా దాడులకు వైసీపీ దిగుతోందన్నారు. తమ నేతలపై పెట్టినవి దొంగకేసులేనని అన్నారు. పెండ్లికి వెళ్లారని యనమల, చినరాజప్పలపై కేసులు పెట్టారని తెలిపారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నించినందుకే దొంగ కేసులు పెడుతున్నారని అన్నారు. అందుకే తమ పార్టీకి చెందిన 36 మంది పై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. తాము అన్నింటికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. ఇండ్ల స్థలాల సేకరణలో అవినీతి జరిగిందన్నారు. వాటికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని అన్నారు. ఈ కేసులో 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.