- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: అమరావతి జేఏసీ తిరుపతిలో మహా పాదయాత్ర ముగింపు సభను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ముగింపు సభకు హాజరు కావాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు జేఏసీ లేఖలు రాసింది. అలాగే వైసీపీ అసమ్మతి నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజును సైతం అమరావతి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణంరాజు శుక్రవారం తిరుపతి చేరుకున్నారు. తిరుపతి విమానాశ్రయం చేరుకున్న ఎంపీ రఘురామకృష్ణంరాజుకు అమరావతి జేఏసీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రైతుల మహోద్యమ సభకు ఎంపీ రఘురామ బయలుదేరి వెళ్లారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. అమరావతి రైతులు తిరుపతి లో నిర్వహిస్తున్న సభ దగాపడ్డ రైతుల సభే తప్ప రాజకీయ సభ కాదని చెప్పుకొచ్చారు. అమరావతి రాజధానిని అడ్డుకునే మేఘాలు అశాశ్వతమని.. అమరావతే శాశ్వతం అని ఎంపీ రఘురామ తెలిపారు. అమరావతి రైతులు చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల రైతులు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ మహోద్యమ సభకు రాష్ట్ర నేతలతోపాటు జాతీయ నేతలు సైతం హాజరవుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సభ తర్వాత మూడు రాజధానుల గురించి మాట్లాడేవారు ఎవరూ ఉండరని చెప్పుకొచ్చారు. అమరావతియే ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా ఉంటుందని అందులో ఎలాంటి సందేహం లేదని ఎంపీ రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.