- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసిందంటూ.. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పోస్ట్
దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి, మెగా హీరో వరుణ్ తేజ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ అమ్మడు వివాహం తర్వాత సినిమాలకు దూరమైంది. ఇంట్లో ఉంటూ మెగా ఫ్యామిలీ బాధ్యతలు తీసుకుంది. అయితే లావణ్య త్రిపాఠి వివాహం తర్వాత మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ఇక ఏ సినిమా ప్రకటించలేదు. ఇండస్ట్రీకి దూరమై పర్సనల్ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది.
కానీ సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉంటూ నిత్యం పలు పోస్టులు చేస్తుంది. అలాగే వరుణ్ తేజ్తో కలిసి వెకేషన్స్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. వాటిని నెట్టింట షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అలాగే మోడ్రన్గా, చీరకట్టులో సంప్రదాయంగా ఉన్న ఫొటోలు షేర్ చేస్తుంది. తాజాగా, లావణ్య త్రిపాఠి ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘అమ్మ పింక్ రూబీ స్టడ్లు ధరించాను. చిన్ననాటి జ్ఞాపకాలకు ప్రతిష్టాత్మకమైన లింక్. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. అవన్నీ నావే’’ అంటూ రాసుకొచ్చింది. లైట్ పింక్ కలర్ చీర కట్టుకుని అదిరిపోయే స్టిల్స్ ఇచ్చింది.