సినిమా ఆపే హక్కు ఎవరికీ లేదు.. ఆ నిర్మాణ సంస్థపై స్టార్ హీరో ఫైర్

by Disha Web Desk 7 |
సినిమా ఆపే హక్కు ఎవరికీ లేదు.. ఆ నిర్మాణ సంస్థపై స్టార్ హీరో ఫైర్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం ‘రత్నం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘సింగం’ సిరీస్ ఫేమ్ హరి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రియా భవానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా రిలీజైన ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఇక ఈ మూవీ ఏప్రిల్ 26న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే హీరో విశాల్ మాట్లాడుతూ.. కోలీవుడ్ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్‌పై సంచలన కామెంట్స్ చేశాడు.

‘గతంలో నేను నటించిన ‘మార్క్ ఆంటోని’ మూవీ విడుదలను రెడ్ జెయింట్ మూవీస్ నిర్మాణ సంస్థ ఆలస్యం చేసింది. కానీ ఆ మూవీ ఎటువంటి అడ్డంకులు లేకుండా విడుదలై మాకు లాభాలే తెచ్చిపెట్టింది. ఒక సినిమాను ఆపేద్దాం.. లేదా తర్వాత విడుదల చేద్దాం అనే హక్కు ఎవరకి లేదు. తమిళ సినిమా నా చేతుల్లోనే ఉందని చెప్పుకునే వారు విజయం సాధించినట్లు చరిత్రే లేదు. ఇది నా ఒక్కడి కోసం చెప్పడం లేదు. నా లాంటి నాలాంటి ఎంతో మంది డబ్బులు ధారపోసి, ఎన్నో కష్టాలు ఎదుర్కొని సినిమా తీస్తుంటే.. కొందరు నిర్మాతలు మాత్రం ఏసీ రూంల్లో కూర్చొని ఆ సినిమా రిలీజ్ చేయకండి.. ఆపేయండి అంటూ ఆదేశాలు ఇస్తుంటారు’ అంటూ ఫైర్ అయ్యాడు విశాల్.


Next Story

Most Viewed