వీడిన శ్రీదేవి డెత్ మిస్టరీ..! ఇన్నాళ్లకు బయట పడిన అసలు నిజం..?

by Disha Web Desk 7 |
వీడిన శ్రీదేవి డెత్ మిస్టరీ..! ఇన్నాళ్లకు బయట పడిన అసలు నిజం..?
X

దిశ, సినిమా: అలనాటి అందాల తారా శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాల నటిగానే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. అప్పట్లో తెలుగు తెరను ఓ ఊపు ఊసేశారు. తన అందం, అభినయం, నతనతో ఎంతో మంది అభిమానుల మనసులు గెలుచుకున్న ఈ బ్యూటీ.. అనూహ్య రీతిలో ఈలోకాన్ని వదిలి వెళ్లిపోయారు. అయితే.. అప్పటి నుంచి శ్రీదేవి మరణంపై అనేవ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటితో పాటు.. ఇప్పటి వరకు కూడా ఆమె మరణానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా ఊహాజనితంగానే మిగిలిపోయింది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీదేవి మృతికి ఇదే కారణమంటూ.. మరో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే..?

గుర్తుండిపోయేలాంటి ఎన్నో వైవిద్యమైన పాత్రలు చేసి ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్న శ్రీదేవికి సినిమానే ప్రపంచం. ఈ క్రమంలోనే ఆమె చనిపోయేంత వరకు కూడా సినిమానే ప్రపంచంగా బ్రతికింది. అంతే కాకుండా హీరోయిన్‌గా తన గ్లామర్ దెబ్బతినకూడదని చాలా కఠినమైన నియమాలు పాటించేదట. అయితే ఈ కఠినమైన ఆహార నియమాల కారణంగా శ్రీదేవికి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ.. ఇబ్బందిపడేదని ఫ్యామిలీ మెంబర్స్ చెపుతుంటారు. ఇందులో భాగంగానే బాత్ టబ్‌లో పడిపోయిన శ్రీదేవి.. నీటిలో ఊపిరి ఆడక చనిపోయిందని భర్త బోనీకపూర్ చాలా సందర్భాల్లో చెప్పారు.

అయితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం మేరకు.. శ్రీదేవి మరణానికి మరోకారణం కూడా ఉందట. శ్రీదేవికి చిన్ననాటి నుంచే జలగండం ఉందట. దాని వల్లే ఆమె ఇలా మరణించిందని ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు కూడా ఇలానే ఓ గండం నుంచి బయటపడిందట. అయితే.. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed