- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘ఆద్యది ఆ ఏజ్ కాదు..’ రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసిన రేణు దేశాయ్..
దిశ, సినిమా: కాస్ట్యూమ్స్ డిజైనర్గా, మోడల్గా, హీరోయిన్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్ ఉమెన్గా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ రేణు దేశాయ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన బద్రి సినిమాలో నటించి.. ఈ హీరోతో ప్రేమలో పడింది. నెక్ట్స్ సినిమా జానీ లో కూడా వీరిద్దరి కాంబోలో రావడంతో పవన్-రేణు దేశాయ్ ప్రేమ మరింత బలపడింది. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. అకీరా, ఆద్యలకు జన్మనిచ్చారు.
కొన్నాళ్ల తర్వాత ఏమైందో తెలియదు కానీ పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ విడిపోయారు. పవన్ మరో పెళ్లి చేసుకున్నప్పటికీ.. ఈ నటి మాత్రం పిల్లల బాగోగులు చూసుకుంటూ ఇండస్ట్రీకి దూరమైంది. చాలా ఏళ్ల తర్వాత రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో హేమలత లవణం పాత్రలో నటించి ఆడియన్స్ వద్ద ప్రశంసలు అందుకుంది. అయితే రేణు దేశాయ్ మీద ఇటీవల రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈమె దీనిపై స్పందించింది.
‘ప్రస్తుతం నేను రెండో వివాహం చేసుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు నా కుమార్తె ఆద్యది స్కూలుకు వెళ్లే వయసు. సెకండ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ తనకు అర్థం కాదు. ఆద్య ఒకవేళ కళాశాలకు వెళ్లే ఏజ్ అయితే తనకు అర్థం అయ్యేదేమో. నా పిల్లల్ని దృష్టిలో ఉంచుకుని నేను ఇప్పట్లో రెండు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు’. అంటూ రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది.