- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్.. మహానటి సావిత్రి వల్లే కోట్లు పోగేశాడు.. బంగారం, కార్లు కూడా అక్కడి నుంచే వచ్చాయి..
దిశ, సినిమా : మహానటి సావిత్రి సౌత్ ఇండస్ట్రీని ఏలింది. వెండితెరపై తనదైన ముద్ర వేస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఒక్కో సినిమాకు లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ .. ఆస్తులు, బంగారం, కార్లు కొనిపెట్టింది. తన తర్వాత మూడు తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిని కూడబెట్టింది. చెన్నై, హైదారాబాద్, ముంబైలో ఇళ్లు కూడా కట్టించింది. కానీ భర్త కారణంగా మందుకు బానిసై జీవిత చరమాంకంలో బాగా కష్టాలు పడింది. ఈ టైంలోనే అయిన వాళ్లు ఆస్తులు లాక్కుంటే.. అభిమానం ఉన్న వారు ఆమె పేరు మీద ఉన్న ఆస్తులు కొని అపురూపంగా చూసుకుంటున్నారు. ఆమె జ్ఞాపకాలను పదిల పరుచుకుంటూనే.. తన సిద్ధాంతాలను ఫాలో అవుతున్నారు.
అలాంటి వారిలో ఒకరు మన డబ్బులు ఊరికే రావు గుండు అంకుల్. అదేనండి లలితా జ్యూవెలరీ ఓనర్ కిరణ్. సావిత్రి గారు నిర్మించిన ఒక ఇంటిని కొనుగోలు చేసిన ఆయన.. అందులో ఉన్న ఆమె ఫొటో ఇప్పటికీ తీయకుండానే పెట్టుకున్నాడట. ఆమె బంగారం, కార్లను ఎక్కువ ఇష్టపడేది కాబట్టి ఆయన కూడా బంగారం వ్యాపారం స్టార్ట్ చేశాడట. ఏ షాప్ ఓపెనింగ్ చేసినా ఆమెతోనే చేయించేలా సెంటిమెంట్ ఫాలో అయ్యేవాడట. అలా మహానటి స్ఫూర్తితోనే బిజినెస్ లో ఆయన రాణించారని ఆమె కూతురు విజయ చాముండేశ్వరి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.