30 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా.. ఇప్పుడు 300కు పైగా థియేటర్లలో రీ రిలీజ్.. ఆ చిత్రం ఏంటంటే..?

by Disha Web Desk 7 |
30 ఏళ్ల క్రితం వచ్చిన సినిమా.. ఇప్పుడు 300కు పైగా థియేటర్లలో రీ రిలీజ్.. ఆ చిత్రం ఏంటంటే..?
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. హిట్, ప్లాప్‌తో సంబంధం లేకుండా గతంలో రిలీజైన సినిమాలను మళ్లీ ఇప్పుడు రీరిలీజ్ చేస్తున్నారు. అలా రీరిలీజ్ అయినా చిత్రాలు.. వసూళ్లు కూడా భారీగానే రాబట్టాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో మూవీ రీరిలీజ్‌కు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. అదే ‘ప్రేమికుడు’.

ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా హీరోగా నటించిన చిత్రం ‘ప్రేమికుడు’. ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. బ్యూటీఫుల్ హీరోయిన్ నగ్మ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ సక్సెస్ అందుకుంది. దాదాపు ఈ మూవీ వచ్చి 30 ఏళ్లు అవుతుండగా ఇప్పుడు రీరిలీజ్ చెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ మే 1వ తేదీన 300కు పైగా థియేటర్లలో ఘనంగా రీరిలీజ్ అవుతుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లు టాక్. ఈ సినిమా రీరిలీజ్‌పై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడంతో వసూళ్లు బాగానే రాబట్టేలా ఉందని విశ్వసనీయ సమాచారం.

Read More..

ఆ హీరోలో అది చూస్తూ ఉండిపోతా.. మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !



Next Story

Most Viewed