- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సో స్పెషల్.. సాయిపల్లవి అందరిలాంటి హీరోయిన్ కాదంట!
దిశ, సినిమా : ఫిదా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ సాయిపల్లవి.ఈ బ్యూటీ తన నటన, అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకోవడమే కాకుండా, నేచురల్ పవర్ స్టార్గా ట్యాగ్ సంపాదించుకుంది. ఇక సాయిపల్లవి ఏ పాత్రలోనైనా సరే ఇట్టే ఒదిగిపోతుంది. శ్యామ్ సింగరాయ్ సినిమాలో ఆమె నటనకు చాలా మంది ఫిదా అయిపోయారు. ఇదంతా పక్కన పెడితే, బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రామాయణం ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి ముఖ్యమైన పాత్రలు పోషించబోతున్నట్లు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం సాయిపల్లవి సీతగా నటించబోతున్నట్లు తెలుస్తుంది. అయితే సీతగా సాయిపల్లవి చేస్తుందని చాలా రోజులుగా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, దీనిపై ఎవరూ ఎలాంటి నెగిటివ్ ప్రచారం చేయడం లేదు. కానీ ఓంరౌత్ 'ఆదిపురుష్' సినిమాలో కృతి సనన్ ను సీతగా చేస్తుందని ప్రకటించడంతో, గ్లామరస్ పాత్రలు చేసిన ఆమె సీతగా చేయడం కరెక్ట్ కాదు అంటూ చాలా మంది వ్యతిరేకించారు. ఇక సాయిపల్లి గ్లామర్ షో చేయ లేదు. అంతేకాకుండా పద్ధతికి మారు పేరుగా ఈ బ్యూటీ నిలుస్తోంది. దీంతో ఫ్యాన్స్కు కూడా సాయిపల్లవి సీత క్యారెక్టర్లో నటించడం నచ్చింది, సాయిపల్లవినే సీత పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అంటున్నారు కొందరు. అందుకే ఈ నటి సీతగా చేస్తోందని తెలిసినా ఎవరూ వ్యతిరేకించడం లేదంటున్నారు నెటిజన్స్.
దీంతో సాయి పల్లవి ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. సీత ఎంపికలో నితీష్ తివారి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, ఫైనల్గా సరైన నటిని రామయణ్కి ఎంచుకున్నారంటూ అంతా ఆయనను ప్రశంసిస్తున్నారు. రామాయణంలో సీతకు నేటి హీరోయిన్లలో సాయి పల్లవి తప్ప ఎవరూ అర్హుల కాదంటున్నారు. దట్ ఈజ్ సాయిపల్లవి.. ఈ బ్యూటీ సో స్పెషల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏప్రిల్ 17న శ్రీరామనవమి సందర్భంగా మూవీపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.