- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Guppedantha Manasu: నేటి ఎపిసోడ్ లో డైరెక్టర్ ఇచ్చిన ట్విస్ట్ సూపర్.. మహేంద్ర, మనుకి ఏమవుతాడంటే?
దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
నువ్వు ఎందుకు నా విషయంలో అంత ఎమోషనల్ అవుతున్నావు. మా కోసం కాలేజీని వదిలిపెట్టారని మహేంద్రను అడుగుతుంది అనుపమ. జగతి చనిపోయిందని తెలిసి నువ్వు ఎందుకు చాలా ఎమోషనల్ అయ్యావు. రిషి కనిపించకుండాపోయినప్పుడు .. మరి నువ్వు కూడా చాలా బాధపడ్డావుగా.. అని మహేంద్ర, అనుపమను తిరిగి ప్రశ్నిస్తాడు. ఎందుకంటే, జగతి నా బెస్ట్ ఫ్రెండ్, స్నేహితురాలికి ఏదైనా జరిగితే ఎవరైనా బాధ పడతారు.. నేను కూడా అలానే ఎమోషనల్ అయ్యా.. అని అనుపమ బదులిస్తుంది.
నువ్వు , నీ బెస్ట్ఫ్రెండ్ విషయంలో ఎమోషనల్ అవ్వడం తప్పు కాదు, నేను, నా బెస్ట్ఫ్రెండ్ విషయంలో తప్పు ఎలా అవుతుంది ..కాదు అని మహేంద్ర చెబుతాడు, నువ్వు, నేను, జగతి ఎప్పుడూ వేరు కాదు. మేం ముగ్గురం ఒక్కటే అని మహేంద్ర అంటాడు. మీకు ఏ సమస్య వచ్చినా నేను మౌనంగా ఉండను అని చెప్పాడు.
గొడవలను మర్చిపోయి కాలేజీకి వెళ్ళమని చెబుతుంది. కానీ మహేంద్ర ఆమె మాట వినడు. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు వదిలిపెట్టేది లేదన్నారు. మను ను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటిస్తాడు. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.