- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జనసేనకు ఓటు వేయొద్దు.. రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతుందంటూ నిహారిక మాజీ భర్త సంచలన వ్యాఖ్యలు
దిశ, సినిమా: ఆంధ్రప్రదేశ్లో మూడు రోజుల్లో ఎన్నికలు రాబోతుండటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇందులో పలువురు సినీ సెలబ్రిటీలు సైతం పాల్గొని సందడి చేస్తున్నారు. అయితే జనసేన పార్టీకి టాలీవుడ్ స్టార్ హీరోలు సపోర్ట్ చేస్తూ పలు పోస్టులు కూడా పెడుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిహారిక మాజీ భర్త జొన్నలగడ్డ చైతన్య జనసేన పార్టీపై, పవన్ కల్యాణ్పై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చైతన్య మాట్లాడుతూ.. జనసేన పార్టీకి ఎవరూ ఓటు వేయకండి. స్వార్థ రాజకీయాల కోసం మెగా ఫ్యామిలీ ఎంతకైనా దిగజారుతారు. జనసేన సిద్ధాంతాలు పవన్ కల్యాణ్ కూడా పాటించడు. ఆయన మాట్లాడే మాటలకు చేష్టలకు ఏ మాత్రం పోలిక ఉండదు.
అలాగే పవన్ కల్యాణ్ తరపున ఎంతో మంది సెలబ్రిటీలు పిఠాపురంలో ప్రచారం చేస్తున్నారు. కానీ వారంతా పవన్ కల్యాణ్ అంటే భయం తోనే ప్రచారం చేస్తున్నారు. దానికి కారణం.. ప్రచారానికి రాకపోతే అవకాశాలు రావని ఆర్టిస్టులను పవన్ భయపెట్టడంతో వస్తున్నారు. జనసేనను నమ్మి ఎంతో మంది మోసపోయారు.. పోతున్నారు. జనసేన అధ్యక్షుడు చంద్రబాబు చెప్పినట్లు వింటున్నాడు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జొన్నలగడ్డ చైతన్య కామెంట్స్ నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియనప్పటికీ చైతన్య కామెంట్స్ గురించి తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ మాత్రం మండిపడుతున్నారు.
కాగా.. మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య 2020లో రాజస్థాన్ ఉదయ్ పూర్లోని విలాస్లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్గా జరిగింది. కానీ వీరి కాపురం ఎక్కువ కాలం నిలవలేకపోయింది. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే నిహారిక, చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో 2023లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక అప్పటి నుంచి నిహారిక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో పాటు.. నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కిస్తోంది. అంతేకాకుండా తన ఫ్రెండ్స్ ఫ్యామిలీతో వెకేషన్స్కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్గా ఉంటూ పలు పోస్టులతో రచ్చ చేస్తుంది.