చీకట్లో చిరంజీవికి చీర కొంగు ఇచ్చిన హీరోయిన్.. ఒక్కసారి లైట్స్ ఆన్ చెయ్యడంతో అందరూ షాక్..

by Disha Web Desk 7 |
చీకట్లో చిరంజీవికి చీర కొంగు ఇచ్చిన హీరోయిన్.. ఒక్కసారి లైట్స్ ఆన్ చెయ్యడంతో అందరూ షాక్..
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఈరోజు చాలా మందికి ఇన్‌స్పిరేషన్‌‌గా నిలిచారు. తన నటనతో, డాన్స్‌తో, సేవా గుణంతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం టాలీవుడ్‌లో ఓ స్టార్ ఫ్యామిలీగా దూసుకుపోతున్నారు. ఇక 68 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికి మంగ్ హీరోలతో సైతం పోటీపడుతూ సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉంటే.. చిరంజీవికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తుంది. అదేంటంటే..

చిరంజీవి, మంజు భార్గవి కలిసి ‘కోతల రాయుడు’ మూవీలో నటించారు. అయితే.. మంజు భార్గవి అప్పట్లో ‘శంకరాభరణం’ మూవీలో నటించింది. అప్పుడు ఆ మూవీ ప్రీమియర్ షోకి మంజు భార్గవి చిరంజీవిని ఆహ్వానించిందట. ఆమె ఆహ్వానం మేరకు చిరంజీవి వెళ్లారట. కానీ ఆ టైంలో చిరంజీవి ఇండస్ట్రీలో చిన్న హీరోగా ఉన్నారు. ఈక్రమంలోనే మంజు భార్గవి పక్కనే కూర్చున్న చిరంజీవి ‘శంకరాభరణం’ క్లైమాక్స్ చూసి బాగా ఎమోషనల్ అయ్యి.. కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక ఆ సమయంలో మంజు భార్గవి తన చీర కొంగు చిరంజీవికి ఇచ్చిందట. ఆమె కొంగుతో చిరంజీవి కళ్లు తుడుచుకుంటున్న సమయంలో లైట్స్ ఆన్ చేశారట. ఇది అక్కడ ఉన్న వాళ్లు అందరూ చూశారట. ఈ ప్రీమియర్ షోకు అల్లు రామలింగయ్య ఫ్యామిలీ కూడా వచ్చిందట. బహుశా సురేఖ కూడా చూసి ఉండొచ్చు అని.. చిరంజీవి ఓ షోలో చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed