చివరి స్టేజ్‌లో ఉండటంతో డాక్టర్లు బతకడం కష్టం అన్నారు.. సోనాలి బింద్రే ఎమోషనల్ కామెంట్స్

by Disha Web Desk 6 |
చివరి స్టేజ్‌లో ఉండటంతో డాక్టర్లు బతకడం కష్టం అన్నారు.. సోనాలి బింద్రే ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రే పలు చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా తెలుగులో ఈ అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోలు మహేష్ బాబు, చిరంజీవితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మురారి, ఇంద్రలో సంప్రదాయంగా కనిపించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సోనాలి పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే 2018లో క్యాన్సర్ బారిన పడటంతో చికిత్స తీసుకుంటూ పూర్తిగా జనాలకు కనిపించకుండా పోయింది. ఇటీవల సోనాలి బింద్రే ది బ్రోకేన్ న్యూస్ సీజన్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన హెల్త్‌కు సంబంధించిన విషయాలు తెలుపుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

సోనాలి మాట్లాడుతూ.. ‘‘నాకు 2018లో క్యాన్సర్ వచ్చింది. ఆ వార్త నా కుటుంబాన్ని చాలా ప్రభావితం చేసింది. అయితే క్యాన్సర్ కన్ఫామ్ అయినప్పుడు.. నేను ఒక రియాలిటీ షో చేస్తున్నాను. అప్పుడే తెలిసింది నా ఆరోగ్య బాగాలేదని. దీంతో డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు.. నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం ఉందని చెప్తారనుకున్నాను. కానీ టెస్ట్‌లు చేశాక క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. దీంతో డాక్టర్ ఆ విషయం చెప్పగానే నా భర్త ముఖం మారిపోయింది. అప్పటికే క్యాన్సర్ చివరి దశ స్టేజ్-4లో ఉన్నట్లు తెలిపారు.

కేవలం 30 శాతం బతికే అవకాశం ఉంది కష్టమే అన్నారు. డాక్టర్ అలా చెప్పడంతో నా భర్త కోపంతో ఊగిపోయి ఆయనను తిట్టారు. అయితే క్యాన్సర్ వచ్చిందని తెలిశాక.. పూర్తిగా అన్నింటికీ దూరంగా ఉండి కీమోథెరపీ చేయించుకున్నా. అది చాలా కఠినమైన చికిత్స అని అప్పుడే తెలిసింది. ఎందుకంటే.. నాకు జుట్టు రావడం వంటి తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాను. కానీ కీమోథెరపీ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సోనాలి బింద్రే కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed