వివాదంలో ‘రేసు గుర్రం’ నటుడు.. నన్ను, నా కుమార్తెను మోసం చేశాడంటూ ప్రెస్ మీట్ పెట్టిన మహిళ (వీడియో)

by Disha Web Desk 7 |
వివాదంలో ‘రేసు గుర్రం’ నటుడు.. నన్ను, నా కుమార్తెను మోసం చేశాడంటూ ప్రెస్ మీట్ పెట్టిన మహిళ (వీడియో)
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు, రజాకీయవేత్త రవి కిషన్ గురించి తెలసిందే. భాషతో సంబందం లేకుండా ఎన్నో సినిమాల్లో విలన్‌గా మెప్పించిన ఈయన.. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ ‘రేసు గుర్రం’ సినిమాతో మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఇక ప్రస్తుతం పొలిటికల్‌గా బిజీగా ఉంటున్న రవి కిషన్.. తాజాగా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రవి కిషన్ తనని తన కూతురిని మోసం చేశాడంటూ ఓ మహిళ ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చింది. లక్నోకి చెందిన అపర్ణ ఠాకూర్ తన కూతురు షెనోవాతో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘బీజేపీ ఎంపీ రవి కిషన్ నా భర్త. అతడు షెనోవాను తన కూతురిగా అంగీకరించాలి. లేకుంటే నేను నా కూతురు చట్టపరమైన హక్కుల కోసం కోర్టును ఆశ్రయిస్తాను. ఈ అంశంపై చర్చించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కూడా కలవాలనుకుంటున్నాను’ అంటూ లక్నోలో విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చింది అపర్ణ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. ఈ వార్తల్లో నిజం ఉంటే రవికిషన్ రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం పడుతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.


Next Story

Most Viewed