- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు స్వగ్రామాలకు యాదాద్రి పవర్ ప్లాంట్ కార్మికులు
<p>దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న వలస కూలీలు లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొంతూర్లకు పంపించాలని కోరుతూ కూలీలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ ఆదేశాలమేరకు అధికారులు వారిని శనివారం హైదరాబాద్కు తరలించారు. మొదటి విడతలో భాగంగా 107 మందిని ప్రత్యేక బస్సుల్లో నగరానికి పంపించారు. అక్కడి నుంచి రైలు ద్వారా వారిని సొంతూళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో మొత్తం 1500 […]</p>
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం యాదాద్రి పవర్ ప్లాంట్లో పనిచేస్తున్న వలస కూలీలు లాక్డౌన్ నేపథ్యంలో జిల్లాలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొంతూర్లకు పంపించాలని కోరుతూ కూలీలు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వ ఆదేశాలమేరకు అధికారులు వారిని శనివారం హైదరాబాద్కు తరలించారు. మొదటి విడతలో భాగంగా 107 మందిని ప్రత్యేక బస్సుల్లో నగరానికి పంపించారు. అక్కడి నుంచి రైలు ద్వారా వారిని సొంతూళ్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించారు. యాదాద్రి పవర్ ప్లాంట్లో మొత్తం 1500 మంది వలస కూలీలు పనిచేస్తుండగా సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి ఇష్టపడే వారిని మొదటి విడతలో ఆరోగ్య పరీక్షలు చేసి మూడు ప్రత్యేక బస్సుల్లో తరలించారు. వీరిలో బీహార్, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు 107 మంది వలస కూలీలను హైదరాబాద్కు పంపించారు. మిగతా కూలీలను కూడా వారి కోరిక మేరకు తరలిస్తామని అధికారులు తెలిపారు.






