సోము వీర్రాజును కలిసిన చిరు.. కారణం ఇదే!

by  |
సోము వీర్రాజును కలిసిన చిరు.. కారణం ఇదే!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజును మెగాస్టార్ చిరంజీవి గురువారం కలిశారు. ముందుగా ఆయనకు చిరు శుభాకాంక్షలు తెలిపారు. తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌తో కలిసి రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సోమువీర్రాజుకు ఆయన సూచించారు.

అంతేకాకుండా 2024 ఎన్నికల్లో బీజేపీ, జనసేన ఆలయన్స్ అధికారంలోకి రావాలని చిరంజీవి ఆకాక్షించినట్లు తెలుస్తోంది. చిరంజీవి మాటలకు ఏపీ బీజేపీ చీఫ్ కూడా పాజిటివ్‌గా స్పందించినట్లు సమాచారం.

Next Story

Most Viewed