జ్యుడిషియల్ రిమాండ్‌కు అడిషనల్ కలెక్టర్….

by  |
జ్యుడిషియల్ రిమాండ్‌కు అడిషనల్ కలెక్టర్….
X

దిశ వెబ్ డెస్క్:
మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్‌కు ఏసీబీకోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. లంచం కేసులో ఆయనకు 14రోజుల జుడిషియల్ రిమాండ్ ను కోర్డు విధించింది. రూ.112 కోట్ల లంచం కేసులో నగేశ్ తో పాటు ఆర్డీవో అరుణా రెడ్డి, చల్చిచేడు ఎమ్మార్వో అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీం మహమ్మద్, నగేశ్,బినామీ జీవన్ గౌడ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇచ్చేందుకు నగేశ్ లంచం డిమాండ్ చేశారు. ఎకరాకు లక్ష చొప్పున కోటి12 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డారు.

Next Story

Most Viewed