దారుణం: జర్నలిస్ట్ సజీవదహనం

by  |
దారుణం: జర్నలిస్ట్ సజీవదహనం
X

దిశ, వెబ్‎డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటికి నిప్పంటించి జర్నలిస్టును సజీవ దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. బలరాంపూర్‎లో స్థానిక జర్నలిస్ట్ రాకేష్ సింగ్ తన స్నేహితుడు నిర్బీక్‎తో కలిసి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో దుండగులు ఇంటికి నిప్పంటించారు. ఈ మంటల్లో రాకేష్ సింగ్‎తో పాటు అతడి స్నేహితుడు నిర్బీక్ సజీవదహనం అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్టును సజీవ దహనం ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయంపై దర్యాప్తు చేసేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు.

కాగా, ఈ ఘటన జరిగినపుడు జర్నలిస్ట్ రాకేష్ సింగ్ భార్య, పిల్లలు వారి బంధువుల ఇంట్లో ఉన్నారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జిల్లా అధికారులు అందజేశారు. బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు.


Next Story

Most Viewed