- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: యూపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటికి నిప్పంటించి జర్నలిస్టును సజీవ దహనం చేశారు గుర్తు తెలియని దుండగులు. వివరాల్లోకి వెళ్తే.. బలరాంపూర్లో స్థానిక జర్నలిస్ట్ రాకేష్ సింగ్ తన స్నేహితుడు నిర్బీక్తో కలిసి ఇంట్లో ఉన్నాడు. ఆ సమయంలో దుండగులు ఇంటికి నిప్పంటించారు. ఈ మంటల్లో రాకేష్ సింగ్తో పాటు అతడి స్నేహితుడు నిర్బీక్ సజీవదహనం అయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జర్నలిస్టును సజీవ దహనం ఎవరు చేశారు? ఎందుకు చేశారనే విషయంపై దర్యాప్తు చేసేందుకు నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేశారు.
కాగా, ఈ ఘటన జరిగినపుడు జర్నలిస్ట్ రాకేష్ సింగ్ భార్య, పిల్లలు వారి బంధువుల ఇంట్లో ఉన్నారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షల చెక్కును జిల్లా అధికారులు అందజేశారు. బలరాంపూర్ షుగర్ మిల్లులో జర్నలిస్టు భార్యకు ఉద్యోగం ఇస్తామని అధికారులు ప్రకటించారు.