- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: జనసేనాని జన్మదిన వేడుకల సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురంలో కటౌట్ కడుతూ విద్యుత్ షాక్ తగిలి జన సైనికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, బాధిత కుటుంబీకులను ఆదుకోవడానికి హీరో రామ్ చరణ్, అల్లు అర్జున్ పలువురు నిర్మాతలు ముందుకొచ్చారు.
టాలీవుడ్ ప్రముఖులు బాధితులకు చేసిన సాయానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ ట్వీట్ చేస్తూ.. ‘కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన రాంచరణ్ కి, అలాగే పెద్దమనుసుతో ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కి, నిర్మాతలు – దిల్ రాజు, ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ నవీన్ కు,నా కృతజ్ఞతలు’ అంటూ పవన్ కళ్యాణ్ చేతులు జోడించారు.