కుంభరాశిలోకి శని.. నేడు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే

by Disha Web Desk 8 |
కుంభరాశిలోకి శని.. నేడు ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే
X

దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.కొంత మంది దీన్ని నమ్మితే మరికొంత మంది లైట్ తీసుకుంటారు.ఇక జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు వాటి స్థానాలను బట్టి రాశుల శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. గ్రహాల్లో శనిగ్రహాని ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది మార్చి 18న కుభరాశిలో ఉదయిస్తుంది.

శని ప్రతి రెండున్నర ఏళ్ల తర్వాత ఒక రాశి నుంచి మరొక రాశిలోకి వెళ్తాడు. క్రమశిక్షణతో కూడిన శని గ్రహం వివిధ రాశుల వారి జాతకాలలో మంచి స్థానంలో ఉంటే శుభ ఫలితాలను, చెడు స్థానంలో ఉంటే అశుభ ఫలితాలను పొందుతారు. అయితే నేడు కుంభరాశిలో శని ఉదయించడం వలన మేష రాశి వారికి చాలా మంచిదంట. దీని కారణంగా వీరు పట్టిందల్లా బంగారమే అవుతుందంట.

చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి ఉద్యోగం దొరకడం, పదోన్నతలు, ఆకస్మిక ధనయోగం, అనుకున్న సమయానికి డబ్బు చేతికందడం, కోర్టుకేసులు అనుకూలంగా రావడం, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి అధిక లాభాలు రావడం. ఇలా ప్రతీ విషయంలో మేషరాశి వారికి నేడు కలిసి వస్తుంది. అలాగే కుంభ రాశి వారికి ఆర్థిక ధనయోగం ఉంది. అన్ని పనుల్లో కలిసి వస్తుంది. నోట్ : ఇది ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఇవ్వబడినది, దిశ దీన్ని ధృవీకరించలేదు.

Next Story

Most Viewed