- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఏపీ బ్యూరో: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజ్ నిండుకుండను తలపిస్తోంది. రోజురోజుకు వరదప్రవాహం పెరుగుతుండటంతో 80 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదిలారు. సాగునీటి అవసరాల కోసం కృష్ణ ఈస్ట్రన్ మరియు వెస్ట్రన్ కాలువలకు 6 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో 83,139 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 73,890 క్యూసెక్కులు. మెుత్తం 30 గేట్లను 2 అడుగుల మేర, 40 గేట్లను 1అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేశారు. సోమవారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజ్కు నాలుగు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదీ పరివాహక ప్రాంత ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని..లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులను కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు.