మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇంట మరో విషాదం..

by  |
మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ ఇంట మరో విషాదం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి ఏపీ మాజీ చీఫ్ సెక్రెటరీ ఎస్వీ ప్రసాద్ ఇంట మరో విషాదం నెలకొంది. కరోనాతో చికిత్స పొందుతూ నిన్న ఎస్వీ ప్రసాద్ మృతి చెందగా, బుధవారం ఆయన సతీమణి లక్ష్మీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల ఎస్వీప్రసాద్ కుటుంబం కరోనా బారిన పడింది. ప్రస్తుతం ఆయన ఇద్దరు కుమారులు కూడా కరోనాతో పోరాడుతున్నారు. అందులో ఒకరు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

తల్లిదండ్రులను కోల్పోయినా వారి అంత్రక్రియల్లో పాల్గొనేందుకు తనయులకు అవకాశం లేకపోవడంతో బంధువులు ఆవేదనకు గురయ్యారు. వీరిద్దరు అయినా క్షేమంగా కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని బంధువులు కోరుకుంటున్నారు. ఇదిలాఉండగా, 2009 నుంచి 2011 మధ్య కాలంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ సీఎం రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల దగ్గర ఎస్వీ ప్రసాద్ సీఎస్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.



Next Story