- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నాగార్జున సాగర్: అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపన. దానికి తగిన పట్టుదల ఉండాలే కానీ వయసుతో నిమిత్తం లేకుండా ఎంతటి పర్వతాన్నైనా ఎక్కేయొచ్చని ఒక మహిళా ఉపాధ్యాయురాలు ‘విజయం’ సాధించి చూపింది. ఉత్తరాఖండ్ లోని రుడుగాయిరా పర్వతాన్ని అధిరోహించి ఔరా..! అనిపించి ఉపాధ్యాయ వృత్తికి మారుపేరుగా నిలిచింది.
వివరాల్లోకి వెళ్తే.. నిడమనూరుకు చెందిన కర్ర విజయలక్ష్మీ.. త్రిపురారం మండలం కంపాసాగర్ గ్రామంలో ఎస్జీటీ టీచర్గా పనిచేస్తోంది. జీవితంలో ఏదైనా ఉన్నత లక్ష్యాన్ని సాధించాలనే తపనతో ఉండే ఆమె.. గత నెల 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు 5,200 మీటర్ల ఎత్తులో ఉన్న రుడుగాయిరా పర్వతాన్ని అధిరోహించింది. ఎత్తెన పర్వతాన్ని అధిరోహించిన టీచర్గా జిల్లాకు ఖ్యాతిని తెచ్చి పెట్టింది. నిరంతర సాధనతోనే ఆమెకు ఈ విజయం సాధ్యమైందని పలు ఉపాధ్యాయ సంఘాలు అభినందించారు.
Next Story