- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
విద్యుత్ సంస్థలు బతకాలంటే చార్జీలు పెంపు అనివార్యమని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పన్ను పెంచాలని, అయితే నిరుపేదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాకే పెంపు వర్తింపజేస్తామని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీలో పల్లెప్రగతి పై జరిగిన స్వల్పకాలిక చర్చలో కేసీఆర్ మాట్లాడారు. ‘ప్రజలు మాపై విశ్వాసంతో మమ్మల్ని గెలిపించారు. ఓట్ల రాజకీయం చేయాల్సిన అవసరం మాకు లేదు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించుకునేలా పాలన కొనసాగిస్తున్నాం’ అని అన్నారు. గ్రామాలు బాగుపడాలంటే ప్రజా సహకారంతోనే సాధ్యమవుతుందని, ప్రతి పంచాయతీకి ఐదు లక్షల రూపాయలు ఆదాయం వచ్చే మార్గాలను చూపించామని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు.
tag; cm kcr, assembly, power companies, electric charges hike
Next Story