అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్.. శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత

by Disha Web Desk 6 |
అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్.. శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: పుణ్యక్షేత్రమైన శబరిమలలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికే శబరిమలలో భక్తుల రద్దీ వల్ల వారికి అక్కడ మౌలిక సదుపాయాలు కరువయ్యాయి. క్యూ లైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సి వస్తుంది. దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా పడుతున్నది. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి క్యూలోనే పోలీసులు నిల్చోబెట్టాడు. చిన్న పిల్లలు ఉన్నారని, ఎంతసేపు నిల్చోవాలంటూ అయ్యప్ప భక్తులు తీవ్ర అసహనంతో పోలీసులను నిలదీశారు. దీంతో ఆందోళన చెలరేగడంతో పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేశారు. ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు కనీసం మంచి నీళ్ళు కూడా అందించని అయ్యప్ప స్వాములు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed