రెండు బైక్‌లు ఢీ ..ఇద్దరి మృతి మరో ఇద్దరికి గాయాలు

by Disha Web Desk 18 |
రెండు బైక్‌లు ఢీ ..ఇద్దరి మృతి మరో ఇద్దరికి గాయాలు
X

దిశ, ఏలూరు: ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..సోమవరప్పాడు వద్ద రాత్రి పొద్దు పోయిన వేళ రెండు బైకులు ఢీకొన్నాయి. ఘటనా స్థలంలో ఒకరు మృతి చెందారు. గాయపడిన ముగ్గురిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరోకరు మృతి చెందారు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఈ ఘటనపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed