విషాదం..వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

by Disha Web Desk 18 |
విషాదం..వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన ముత్తారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఓడేడుకు చెందిన మొగిలి రమేష్(45) ప్రతి రోజు లాగానే తన పంట పొలం వద్దకు మోటర్ వేయడానికి వెళ్లి మధ్యాహ్నం వరకు ఇంటికి రాలేదు. రోజు సమయానికి ఇంటికి వచ్చే రమేష్ ఇంకా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. అక్కడకి వెళ్లి చూడగా రమేష్ మానేరులో కింద పడి ఉండడం చూసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు గ్రామస్తులు , కుటుంబ సభ్యులు తెలిపారు.


Next Story

Most Viewed