- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
BREAKING: మర్డర్ కేసులో.. కర్నూలు ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పు
దిశ, వెబ్డెస్క్: మహిళలపై దాడి చేయాలంటేనే భయపడే విధంగా ఇవాళ కర్నూలు ఫ్యామిలీ కోర్టు ఓ మర్డర్ కేసులో సంచలన తీర్పును వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. కర్నూలుకు చెందిన రుక్మిణి, శ్రవణ్కు 2023లో వివాహం జరిగింది. ఈ క్రమంలో పెళ్లైన 14 రోజులకే రుక్మిణి తల్లి రమాదేవిని అల్లుడు శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవి కలిసి దారుణంగా హతమార్చారు. దీంతో వారిపై అనుమానం వచ్చిన రుక్మిణి వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా రుక్మిణి తల్లి రమాదేవిని చంపింది భర్త శ్రవణ్, మామ వరప్రసాద్, అత్త రమాదేవి అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అందుకు సంబంధించిన సాక్ష్యాధారాలను కోర్టు ముందుకు ఉంచారు. ఇరు పక్షాల వాదనలు విన్న కర్నూలు ఫ్యామిలీ కోర్టు అల్లుడు శ్రవణ్, మామ వరప్రసాద్లకు ఉరి శిక్ష విధించింది. అదేవిధంగా హత్యకు సహకరించిన అత్త రమాదేవికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ.. కోర్టు తుది తీర్పును వెలువరించింది.