- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బహదూర్ పురలో విషాదం... స్నేహితుడిని కత్తితో పొడిచి దారుణ హత్య
దిశ, చార్మినార్ : తాగిన మత్తులో తలెత్తిన వివాదంలో స్నేహితుడినే అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన బహదూర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ హత్య హతుని కన్న తండ్రి ముందే జరగడం విచారకరం.. ఈ సంఘటన సోమవారం అర్థ రాత్రి బహదూర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళితే... కిషన్ బాగ్ అసద్ బాబానగర్ కు చెందిన మహ్మద్ ఖలీల్ (25) డ్రైవర్. అర్ధరాత్రి కొంతమంది స్నేహితులు కలిసి స్థానికంగా ఉన్న నాలా వద్ద కూర్చుని మద్యం తాగారు.
అనంతరం మద్యం తాగాక వీరికి కుస్తీ పడటం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలోనే మరొకసారి వీరు కుస్తీ పడ్డారు. ఈ కుస్తీ తరహా పోటీలో ఒక వ్యక్తిని మృతుడు ఖలీల్ కొట్టాడు. దీంతో మిగతా యువకులంతా కలిసి ఖలీల్ పై తీవ్రంగా దాడి చేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లు చూసి వారిని చెదరగొట్టి పంపించి వేశారు. మృతుని తండ్రి సంఘటనా స్థలానికి వచ్చి కొడుకును బైక్ పై కూర్చో బెట్టుకొని తీసుకెళ్తున్నాడు.
వెనుక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన స్నేహితుడు బైక్ మీద ఉన్న ఖలీల్ ను కిందికి లాగాడు. అతని తండ్రి కళ్ళ ముందే ఖలీల్ ను కత్తితో పొడిచి హత్య చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఖలీల్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న డీసీపీ సాయి చైతన్య ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ కేసును బహదూర్ పురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.