మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. బస్సులో 50 మంది ప్రయాణికులు

by Disha Web Desk 12 |
మేడారం వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం.. బస్సులో 50 మంది ప్రయాణికులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ రోజు నుంచి తెలంగాణ మహా కుంభమేల గా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర ప్రారంభం అయింది. ఈ క్రమంలో భక్తులను మేడారం తీసుకెళ్తున్న ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సును జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ తో పాటుగా లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే బస్సులో ఉన్న పలువురు ప్రయాణికులకు కూడా స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed