- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు
by Disha Web Desk 12 |
X
దిశ, ఎల్లారెడ్డిపేట: మండలంలోని బొప్పాపూర్ శివారు కామారెడ్డి సిరిసిల్ల ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. బుధవారం వీర్నపల్లి మండలం బావ్ సింగ్ తండాకు చెందిన భూక్య సతీష్ 24, భూక్య సాయిరాం ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో ముందుగా వెళ్తున్న కారును ఓవర్టేక్ చేస్తున్న నేపథ్యంలో అటుగా వస్తున్న ఇసుక ట్రాక్టర్ను బైక్ ఢీకొట్టింది. దీంతో భూక్య సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయిరాం కి తీవ్ర గాయాలు కాగా.. సిరిసిల్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story