- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- ఉగాది రాశి ఫలాలు
- Job Notifications
తల్లిపై చేయిచేసుకున్న తమ్ముడు.. ఆ తర్వాత ఘాతుకానికి పాల్పడ్డ అన్న

దిశ, డైనమిక్ బ్యూరో: కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకు తల్లిపై చేయిచేసుకున్నాడు. తమ్ముడు చేయి చేసుకోవడాన్ని గమనించిన అన్న అమ్మమీదే చేయి చేసుకుంటావా అంటూ ఆగ్రహానికి గురయ్యాడు. క్షణికావేశంలో చాకు తీసుకుని తమ్ముడి చాతిలో పొడిచాడు. దీంతో అతడు చనిపోయాడు. ఈ విషాదఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. మైలవరం నియోజకవర్గం స్థానిక పొందుగల రోడ్డులో కృష్ణవరపు ప్రసన్నకుమార్, కరుణ కుమార్లు నివశిస్తున్నారు. అయితే కరుణ కుమార్ తల్లి పై దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన అన్న ప్రసన్నకుమార్ తమ్ముడిపై కోపంతో రగిలిపోయాడు. పక్కనే ఉన్న చాకుతో తమ్ముడిని పొడిచాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా కరుణకుమార్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.