- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రూ.500 దగ్గర వచ్చిన గొడవ.. స్నేహితుడిని పొడిచి హత్య చేసిన యువకుడు..
దిశ, వెబ్డెస్క్: స్నేహితుల మధ్య గొడవలు జరుగుతూనే ఉంటాయి. అసలు గొడవలు జరగకుండా ఉన్న స్నేహితులే ఉండరని చెప్పుకొవచ్చు. కానీ ఢిల్లీలో మాత్రం 25 ఏళ్ల యువకుడు తన స్నేహితుడితో గొడవ జరగడంతో అతడిని హత్య చేశాడు. కేవలం రూ.500 దగ్గర వచ్చిన గొడవ స్నేహితుడి ప్రాణం తీసే వరకు తీసుకెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారిద్దరూ డ్రగ్ అడిక్ట్స్ అని పోలీసులు గుర్తించారు. ఇదే క్రమంలో సెప్టెంబర్ 18న వారిద్దరి మధ్య డ్రగ్స్ విషయంలో భారీ వాగ్వాదం జరిగిందని, దాని కారణంగా తన స్నేహితుడిని హత్య చేశానని నిందితుడు విచారణలో చెప్పాడని పోలీసులు తెలిపారు.
తనకు తన స్నేహితుడు డ్రగ్స్ తీసుకురమ్మని రూ.500 ఇచ్చాడని, ఆ విషయంపైనే తామిద్దరి మధ్య వాగ్వాదం మొదలైందని, ఆ గొడవతో తీవ్రంగా కోపం రావడంతో అతడిపై కత్తితో దాడి చేశానని నిందితుడు తెలిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే తమకు స్థానిక ఆసుపత్రి నుంచి సమాచారం వచ్చిందని, ఒక వ్యక్తి పదునైన గాయంతో అడ్మిట్ అయ్యాడని, చికిత్స జరుగుతుండగా అతడు మరణించాడని వైద్యులు తమకు తెలిపారని పోలీసులు తెలిపారు.
అక్కడకు వెళ్లిన పోలీసుల దర్యాప్తు ప్రారంభించారని, అప్పుడు మరణించిన వ్యక్తి షారుఖ్ (22)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతడు ఓ ఐరన్ ఫ్యాక్టరీలో డైమేకర్గా పనిచేసేవాడని, అతడితో పాటు అతడి స్నేహితుడు సల్మాన్ కూడా అక్కడే పనిచేసేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. అనంతరం వారి నివాసానికి వెళ్లి చూస్తే సల్మాన్ పరారీలో ఉన్నాడు. దాంతో పక్కా ప్లాన్తో పోలీసులు సల్మాన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.