- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ :
మృతిచెందిన ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో ఆ డెడ్బాడీ మంచినీళ్లు తాగిందని పుకారు లేవడంతో కుటుంబసభ్యులు కంగారు పడ్డారు. బతికున్న వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామా.. అనుకుని వెంటనే మృతి చెందిన వ్యక్తిని స్థానిక కేఐఎమ్ఎస్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన కర్నాటకలోని ధార్వాడ్లో శుక్రవారం జరగగా స్థానికంగా కలకలం రేపింది.
బంధువుల వివరాల ప్రకారం.. అక్కడి డాక్టర్లు ఆ వ్యక్తిని మరల పరీక్షించగా మీరు అనుకుంటున్నది నిజం కాదని స్పష్టంచేశారు. అతను మృతిచెంది చాలా సమయం గడచిందని, మృతదేహం మంచినీళ్లు తాగడం మీ భ్రమ మాత్రమే అని కొట్టిపారేసారు. అనంతరం యథావిధిగా కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, గుండెపోటుతో సదరు వ్యక్తి మరణించినట్లు సమాచారం. పార్థివ దేహానికి స్నానాధికారాలు చేయించే క్రమంలో నోటిలో పోసిన మంచి నీటిని మృతదేహం మింగేసినట్లు అంత్యక్రియలకు వచ్చిన వారిలో ఒకరు భ్రమపడటమే ఇంతటి కల్లోలానికి దారి తీసింది.