31 శాతం వృద్ధిని నమోదు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్

by Disha Web Desk 17 |
31 శాతం వృద్ధిని నమోదు చేసిన ఐసీఐసీఐ బ్యాంక్
X

ముంబై: ప్రైవేట్ రంగ ఐసీఐసీఐ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో 31.43 శాతం వృద్ధితో ఏకీకృత నికర లాభం రూ. 8,006.99 కోట్లను నమోదు చేసింది. స్టాండ్‌లోన్ ప్రాతిపదికన 37.14 శాతం వృద్దితో రూ. 7,557.84 నికర లాభాన్ని ఆర్జించింది. ఇది ఏడాది క్రితం రూ. 5,510.95 కోట్లుగా ఉంది. సమీక్షించిన త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 31,088 కోట్లకు చేరుకుంది. అలాగే మొత్తం ఖర్చులు రూ. 18,027 కోట్ల నుండి రూ. 19,408 కోట్లకు పెరిగాయి.

ఐసిఐసిఐ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సందీప్ బక్షిని మూడు సంవత్సరాల కాలానికి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా తిరిగి నియమించినట్లు బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ప్రస్తుత పదవీకాలం అక్టోబర్ 3, 2023 వరకు ఉంది. పదవీకాలం పెంపుతో ఆయన అక్టోబర్ 3, 2026 వరకు పదవిలో ఉండనున్నారు

ఇవి కూడా చదవండి :

ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలను నమోదుచేసిన కోటక్ మహీంద్రా బ్యాంక్

Next Story

Most Viewed