Kadapa: బ్రదర్ అనిల్‌‌ను బీటెక్ రవి కలవడం వెనుక జరిగిందిదే...!

by Disha Web Desk 16 |
Kadapa: బ్రదర్ అనిల్‌‌ను బీటెక్ రవి కలవడం వెనుక జరిగిందిదే...!
X

దిశ, కడప: త్వరలో పులివెందుల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని ఆ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు. వైయస్సార్ జిల్లా వేంపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప ఎయిర్ పోర్టులో అనిల్‌ను యాదృశ్చికంగానే కలిశానని చెప్పారు. తామంతా జగన్ వల్ల దెబ్బతిన్న బాధితులమేనన్నారు. బ్రదర్ అనిల్‌తో కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. షర్మిల, బ్రదర్ అనిల్, విజయమ్మ కూడా జగన్ బాధితులేనని తెలిపారు. నిన్నటి వరకు షర్మిలను ఒక్క మాట కూడా అనని వైసీపీ నేతలు కాంగ్రెస్‌లో చేరగానే ఆమెపై విమర్శలు ప్రారంభించారన్నారు. వైసీపీకి ఇబ్బంది అనుకుంటే విజయమ్మపై కూడా విమర్శలు చేస్తారని మండిపడ్డారు. పులివెందులలో జగన్‌పై వ్యతిరేకత తారా స్థాయికి చేరిందని తెలిపారు. టీడీపీలో చేరిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో పులివెందుల నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు ఉంటాయని బీటెక్ రవి పేర్కొన్నారు.

Next Story

Most Viewed