- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
వైసీపీ ఎమ్మెల్సీకి 18 నెలల జైలు శిక్ష.. కేసు ఇదే..!
by Disha Web Desk 4 |
X
దిశ, వెబ్డెస్క్: 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, రూ.2 లక్షల జరిమానా విధించింది. ఈ కేసులో తోట త్రిమూర్తులతో పాటు 9 మంది నిందితులుగా ఉన్నారు. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో శిరోముండనం ఘటన జరిగింది. ఎన్నికల కక్షలతో దళిత యువకులకు శిరోముండనం చేశారు. ఇద్దరికి గుండు కొట్టించడంతో పాటు కనుబొమ్మలు గీయించారు. 1997 జనవరి 1న ఆనాటి జిల్లా ఎస్పీ కేసు నమోదు చేశారు. తోట త్రిమూర్తులతో సహా 9 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. 1998లో కేసును కొట్టేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మళ్లీ 2000 సంవత్సరంలో కేసును ప్రభుత్వం రీ ఓపెన్ చేసింది. మొత్తం 24 మంది సాక్షుల్లో 11 మంది మృతి చెందారు.
Next Story