కొవ్వు కరింగించుకోవడానికే లోకేష్ పాదయాత్ర.. ఎమ్మెల్యే ద్వారంపూడి

by Dishafeatures2 |
కొవ్వు కరింగించుకోవడానికే లోకేష్ పాదయాత్ర.. ఎమ్మెల్యే ద్వారంపూడి
X

దిశ (ఉభయ గోదావరి ప్రతినిధి): టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్ పాదయాత్ర కేవలం కొవ్వును కరిగించుకోవడానికే చేస్తున్నారని, అతనికి సీటు బాగా పెరిగిపోయిందని కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖచ్చితంగా స్లిమ్ గా అవ్వడానికే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారే తప్ప ప్రత్యేక మైన కారణం ఏదీ లేదని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తాను ఇచ్చిన ఎన్నికల హామీలను తుంగలో తొక్కడం వల్ల గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారని, కానీ నేడు సీఎం జగన్ ఇచ్చిన హామీల కంటే ఎక్కువే చేశారని అన్నారు. అలాంటప్పు లోకేష్ కు పాదయాత్ర చేయాల్సని అవసరం లేదని చెప్పారు.

లోకేష్ పాదయాత్రను చూసి తాము భయపడటం లేదని, కడుపుబ్బా నవ్వుకుంటున్నామని ఎద్దేవా చేశారు. లోకేష్ పాదయాత్ర వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఎమ్మెల్యే అన్నారు. సీటు తగ్గించుకొని, స్లిమ్ గా అవ్వడం కోసం చేస్తున్న పాదయాత్ర వల్ల జనానికి ఉపయోగం ఏంటీ అని ప్రశ్నించారు. అసలు ప్రజలకు జగన్ దయవల్ల ఎటువంటి కష్టాలు లేవని అన్నారు. ఈ తరుణంలో లోకేష్ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు ఏం చెబుతారో అర్థం కావడం లేదని అన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ రాగిరెడ్డి దీప్తి, సిటీ అద్యక్ష్యురాలు సుంకర శివ ప్రసన్న సాగర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story