- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Ap Politics: ఆ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలుపు వరించేనా..?
దిశ,చంద్రగిరి: నియోజకవర్గం పేరు చెప్పగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది చంద్రగిరి కోట. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో చంద్రగిరి కోట పై ఎవరు జెండా ఎగరవేస్తారు అనే చర్చ మొదలైంది. 2014,2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎలక్షన్ లో వైసీపీ పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని సైతం ఏర్పాటు చేసింది. 2019 ఎలక్షన్ లో చెవి రెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచిన తర్వాత తుడా చైర్మన్ గా టీటీడీ బోర్డు మెంబర్ గాను ప్రభుత్వ విప్ గాను బాధ్యతలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో తన కుమారుడైన చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టి వైసిపి పార్టీతో హ్యాట్రిక్ కొట్టించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ 1994 తర్వాత నుంచి చంద్రగిరిలో తన సత్తా చాటుకోలేకపోయింది.
2019 ఎలక్షన్లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన పులివర్తి నాని ఓడిపోయారు. ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్య తిరుగుతూ 2024లో మరల టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆశీస్సులతో ఎలక్షన్ లో పోటీ చేయడానికి సీటు సాధించుకున్నారు. చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి అసలు తలనొప్పి ప్రారంభమైంది. ఇంతకాలం టీడీపీ ఎమ్మెల్యే సీటును ఆశించిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త డాలర్స్ దివాకర్ రెడ్డి, ఓబిసి ఫోరం అధ్యక్షుడు బడి సుధా యాదవ్ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని గెలుపుకు పూర్తి సహకారం అందిస్తాం అని అన్నారు.
ఒకవేళ డాలర్స్ దివాకర్ రెడ్డి బడి సుధా యాదవ్ టీడీపీకి రెబల్స్ గా ఉంటే టిడిపికి పడవలసిన ఓట్ల శాతం తగ్గి వైసీపీ ఓట్ల శాతం పెరిగి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సునాయాసంగా గెలవచ్చు అని ఆలోచన ఉన్నారు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. రెడ్డి సామాజిక వర్గం, యాదవ సామాజిక వర్గంతో పాటు బలిజ సామాజిక వర్గంలో సైతం వైసీపీకి పడవలసిన ఓట్ల శాతం తగ్గనున్నాయి. ఇటీవల చంద్రగిరిలో టీడీపీ కి మద్దతుగా కాపు సామాజిక వర్గంలో బలమైన నేత వంగవీటి రాధ నిర్వహించిన సభ పెద్ద ఎత్తున విజయం సాధించడంతో బలిజ సామాజిక వర్గం ఓట్ల సైతం టిడిపికి అధిక శాతంలో పడనున్నాయి.
అంతేకాకుండా నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నిర్ణయించేటటువంటి ఓటు బ్యాంకు కలిగిన పాకాల మండలంలో, తిరుపతి రూరల్ మండలంలో గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయానికి తోడ్పడిన ముఖ్య నాయకులందరూ టీడీపీలోకి వలసలు వెళుతున్నారు. పులివర్తి నాని గెలుపుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ పాలన నచ్చకే పార్టీని వీడుతున్నం అని వాపోతున్నారు. ఇది ఇలా ఉండగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పి.ఏ, పి.ఆర్.ఓ ల మాటలకే ఎక్కువ విలువ ఇస్తున్నారని తమను పట్టించుకోవడం లేదని కొందరు ముఖ్య నాయకులు నొచ్చుకుంటున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గెలుపు నల్లేరుపై నడకలా దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత చంద్రగిరి కోటపై టీడీపీ జెండా ఎగరవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.