Ap News: సీఎం జగన్ సభకు విద్యార్థులను తీసుకురండి.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

by Disha Web Desk 16 |
Ap News: సీఎం జగన్ సభకు విద్యార్థులను తీసుకురండి.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
X

దిశ, భీమవరం: డిసెంబర్ 8న సీఎం జగన్ భీమవరంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆదేశించారు. సీఎం జగన్ హెలీప్యాడ్ దగ్గర దిగినప్పటి నుంచి తిరుగు ప్రయాణం వరకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలన్నారు. హెలీప్యాడ్ నుంచి బి.వి రాజ్ సర్కిల్, బైపాస్ మీదగా సభా వేదిక వద్దకు సుమారు 2 కి.మీ ముఖ్యమంత్రి రోడ్ షో ఉంటుందన్నారు. సంబంధిత అధికారులు సమన్వయ చేసుకుంటూ ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలన్నారు. ముందుగా హెలిప్యాడ్, సభావేదిక లేఅవుట్‌లను సిద్ధం చేయాలన్నారు. విద్యా దీవెన పొందుతున్న ప్రతి ఒక్క విద్యార్థి సభలో పాల్గొనేలా చూడాలన్నారు. జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ యు.రవి ప్రకాష్ మాట్లాడుతూ తగినంత బందోబస్తుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. వారికి నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలోనే వాహనాలు నిలుపుదల చేయాలన్నారు.



Next Story

Most Viewed