- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చోరీ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్
దిశ ప్రతినిధి,విజయనగరం:నగరంలో తోట పాలెం ఎయిమ్స్ స్కూల్ సమీపంలో పశువులను కాస్తున్న వృద్ధురాలి మెడలో చైన్ దొంగిలించిన ఇద్దరు నిందితులను 24 గంటల వ్యవధిలో పట్టుకున్నామని వన్ టౌన్ సీఐ వెంకటరావు తెలిపారు.నిందితుల నుంచి దొంగిలించిన బంగారు చైను, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ వెంకట్రావు శుక్రవారం వెల్లడించారు.విజయనగరం తోట పాలెం కు చెందిన బంక గురుమూర్తమ్మ అనే వృద్ధురాలు ఎయిమ్స్ స్కూల్ వెనుక భాగంలో పశువులను మేపుతుండగా అక్కడకు వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి ఆ మహిళ యోగ క్షేమాలు అడుగుతున్నట్లు మాట్లాడి, చుట్టు ప్రక్కల ఎవ్వరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత వృద్ధురాలి మెడలో చైన్ లాక్కొని, కొద్ది దూరంలో ఉన్న మరొక వ్యక్తి మోటారు వాహనం పై పరారయ్యారు.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వన్ టౌన్ క్రైమ్ ఎస్ఐ జే.తారకేశ్వర రావు, క్రైమ్ బృందం నేర స్థలాన్ని సందర్శించి, కొన్ని ఆధారాలు సేకరించి, చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితులను గుర్తించారు.వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. పూసపాటి రేగ చాకలి వీధికి చెందిన మామిడి సత్య కుమార్, గురాన భార్గవ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి బంగారు చైను, నిందితులు వినియోగించిన రెండు మొబైల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి నెలలో వెంకటేశ్వర స్వామి కోవెల సమీపంలో నిందితులు ఇదే తరహా నేరానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు.