Anakapalle Jansena ఆధ్వర్యంలో మహా పాదయాత్ర

by Disha Web Desk 16 |
Anakapalle Jansena ఆధ్వర్యంలో మహా పాదయాత్ర
X

దిశ, ఉత్తరాంధ్ర: డిసెంబర్ 9న అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో పాదయాత్ర ప్రారంభించి అనకాపల్లి వరకు యాత్రను కొనసాగించాలని జనసేన పార్టీ నిర్ణయించింది. యలమంచిలి నియోజకవర్గ ఇంఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ నాయకత్వంలో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ప్రధాన సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకునే విధంగా యాత్ర ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం భూసేకరణ ద్వారా నష్టపోతున్న బాధితుల నష్టపరిహారంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నారు. రోడ్డు పూర్తిగా గోతులమయంకావడంతో ప్రజలు పడే ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌కు నివేదిక సమర్పించడానికి ఈ పాదయాత్ర చేస్తున్నామని విజయకుమార్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎలమంచి నియోజకవర్గ ప్రజలంతా పార్టీలకు అతీతంగా పాల్గొని సంఘీభావం తెలిపి సమస్య యొక్క తీవ్రతను ప్రభుత్వానికి తెలిసే విధంగా పాలుపంచుకోవాలని కోరారు.నేడు అచ్యుతాపురం జన సేన పార్టీ ప్రధాన కార్యలయం లో సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed