ముఖ్యమంత్రికి ‘ఐ లవ్ యూ’ చెప్పిన శ్రీరెడ్డి.. బోరున ఏడుస్తోన్న వీడియో వైరల్

by Disha Web Desk 9 |
ముఖ్యమంత్రికి ‘ఐ లవ్ యూ’ చెప్పిన శ్రీరెడ్డి.. బోరున ఏడుస్తోన్న వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జగన్ వీరాభిమాని, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా అయిన నటి శ్రీరెడ్డి స్పందించింది. ఇప్పటికే ఎన్నో సార్లు జగన్‌ను ఎవరైనా ఏమైనా అంటే వెంటనే ఫైర్ అయ్యేది. గతంలో జనసేనాని పవన్ కల్యాణ్‌తో పాటు, టీడీపీ నాయకులపై మండిపడింది. తాజాగా జగన్ చేపట్టిన సిద్ధం బస్సు యాత్రలో విజయవాడకు చేరుకున్న అనంతరం ఆయనపై గుర్తు తెలియని వ్యక్తి ఎవరో దాడి చేశారు. ఈ ఘటనపై శ్రీరెడ్డి ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. టీడీపీ నేతలను ఏకిపారేస్తూ.. ‘మీరు అసలు మనుషులా. ఒక మనిషి ప్రాణం తీయడానికి కూడా తెగిస్తారా? పదవుల కోసం జగనన్నకు ఇంత హాని కలుగజేస్తారా? ఒరేయ్ బొండాగా జగన్ అంటే ఎంత మందికి ప్రాణమో తెలుసారా? ఆయన కోసమే ఎంతో మంది బతుకుతున్నారు. ‘జగనన్న ఐ లవ్ యూ’ అంటూ శ్రీరెడ్డి బోరున ఏడ్చేస్తుంది.


Next Story

Most Viewed