- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఓటు వేస్తే ఆ భావన కలగాలి: Chandrasekhar Reddy
దిశ, నెల్లూరు: ఎమ్మెల్సీగా మంచి వ్యక్తికి ఓటు వేశామన్న భావన ఉద్యోగులకు కలుగజేసేలా పని చేస్తానని తూర్పు రాయలసీయ ఉపాద్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు భువన విద్యాలయంలో చంద్రశేఖర్ రెడ్డికి మద్దతుగా ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ,విద్యా వ్యవస్థకు అనుగుణంగా ప్రైవేట్ విద్యా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందాలని, అప్పుడే ప్రభుత్వంపై భారం లేకుండా విద్యావకాశాలు అందరికి దక్కుతాయని చెప్పారు. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఇప్పటికే తమ దృష్టికి వచ్చాయని, వాటి పరిష్కరించేందుకు కృషి చేస్థానన్నారు. ప్రైవేట్ పాఠాశాలలకు 10 సంవత్సరాల గుర్తింపు త్వరలో సాధిస్తామని, అంతేకాకుండా ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు కృషి చేస్తామని చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.