Breaking News: టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్

by Disha Web Desk 16 |
Breaking News: టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ మంచిగా ఉంటూనే 20 సీట్లకే పరిమితం చేశామనే సంకేతాలు ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. కాపు సంక్షేమ సేన ప్రజాప్రతినిధులతో భేటీ అయిన పవన్ కల్యాణ్... లోపాయికారి ఒప్పందాలకు తాను లొంగిపోనని స్పష్టం చేశారు. ఏ పార్టీ అజెండా కోసం పని చేయమన్నారు. వాస్తవికతను దృష్టిలో పెట్టుకునే మాట్లాడతానని చెప్పారు. అవమాన పడుతూ ఎక్కడైనా తాను ఎందుకు ఉంటానని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. కులాలను తగ్గించే హక్కు ఎవరికీ లేదని, జనసేనను నమ్మాలని.. ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని తగ్గించమని పవన్ తెలిపారు.

కాపులు అధికారంలోకి వస్తే బీసీలు, దళితులను తొక్కేస్తారనే విష ప్రచారం జరుగుతోందని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. కులాలను వాడుకునే వాళ్లు ఉన్నారని.. పట్టించుకునే నాయకులు లేరన్నారు. కాపులకు సంఖ్యా బలం ఉందని, ఇంకా రిజర్వేషన్ల కోసం దేహీ అనే పరిస్థితి వచ్చిందన్నారు. కాపులంతా ఒక్కటిగా ఉంటే అధికారం దానికదే వస్తుందని చెప్పారు. కొంతమంది కులాల మధ్య కుంపట్లు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. బీసీ, ఎస్సీ, కాపుల్లో సంఖ్యా బలం ఉందని... కానీ ఐక్యత లేదని పవన్ పేర్కొన్నారు. కుళ్లు, కుట్రలు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదన్నారు. తాను మెత్తటి మనిషిని కాదని పవన్ హెచ్చరించారు.


Next Story

Most Viewed