AP:సత్యాన్ని ఓడించే శక్తి మనిషికి లేదు..బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 18 |
AP:సత్యాన్ని ఓడించే శక్తి మనిషికి లేదు..బ్రదర్ అనిల్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,బద్వేలు: ఆయనను అంత దారుణంగా హత్య చేయడం, ఆ వయసులో ఆయన పట్ల అలా ప్రవర్తించడం చాలా బాధాకరం దాన్ని సపోర్ట్ చేయడం తప్పు అంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. సోమవారం బద్వేల్ లోని రాఘవేంద్ర గ్రాండ్ ఫంక్షన్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో విలేకరుల ప్రశ్నలపై స్పందిస్తూ ఆయన ఈ విధంగా మాట్లాడారు. రాజశేఖర్ రెడ్డి హైదరాబాద్‌లో ఉంటే ఇక్కడ అంతా ఆయన చూసుకునేవాడని మాట్లాడారు. వైఎస్ కు కుడి భుజంలా ఉండే వారున్నారు. ఇప్పుడు రాజకీయాన్ని కమర్షియల్‌గా మారాయన్నారు. తాను చర్చిలో ప్రార్థన చేస్తాను తప్ప రాజకీయాలు మాట్లాడనని పేర్కొన్నారు. అలాగే షర్మిల గురించి కూడా ఎవరిని ఓటు అడగనని అన్నారు. ఎవరు డబ్బులకు కకృతి పడవద్దు, న్యాయానికి ఎప్పుడు విజయమే ఉంటుంది అన్నారు.

న్యాయానికి బలం ఉంటుందని, అన్యాయానికి బలం ఉండదని, న్యాయాన్ని ఓడించే సామర్థ్యం ఏ మనిషికి, డబ్బుకు ఉండదన్నారు. నిన్నటి దినం కడపలోని ఓ ప్రార్థన మందిరంలో నేను ప్రభువైన ఏసుక్రీస్తు సందేశాలు వివరిస్తూ పాములను తేళ్లను తొక్కి అధికారం యేసయ్య సంఘానికి ఇచ్చారనే అర్థంతో మాట్లాడానని అన్నారు. యేసుక్రీస్తు లోకంలోకి వచ్చి ప్రజలకు న్యాయం చేశారని అన్నారు, దేవుడు ఎల్లవేళలా న్యాయం వైపు ఉంటాడని పేర్కొన్నారు. నేను రాజకీయాల గురించి వారికి సపోర్ట్ చేయకండి, వీరికి సపోర్ట్ చేయండి అని ఎప్పుడూ అర్థం వచ్చేలా మాట్లాడను అన్నారు. అయితే న్యాయం ఎవరి వైపు ఉంటుందో దేవుడు వారికి అండగా ఉంటాడని, సత్యానికి ఉన్న బలం అలాంటిదని పేర్కొన్నారు. దయచేసి నేను చెప్పే వాఖ్యలను వేరే అర్థం వచ్చేలా మీడియాలో కథనాలు అల్లవద్దని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు క్రైస్తవ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed