ఈనెల 22న గన్నవరంలో లోకేశ్ బహిరంగ సభ

by Disha Web Desk 21 |
ఈనెల 22న గన్నవరంలో లోకేశ్ బహిరంగ సభ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఈనెల 22న యువగళం పాదయాత్రకు సంబంధించి బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గన్నవరంలో జరగనున్న భారీ బహరంగ సభ ఏర్పాట్లను మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజులు ఆదివారం పరిశీలించారు. ఈ నెల 22న మధ్యాహ్నం 03.00 గంటలకు గన్నవరంలో భారీ బహిరంగ సభ జరగనుంది. కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ యువగళం పాదయాత్రని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇకపోతే కృష్ణాజిల్లాలో ప్రవేశించిన యువ గళం పాదయాత్ర ఒక ఉప్పెనల కొనసాగుతుందని కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ యువగళం పాదయాత్రకు జనం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారని చెప్పుకొచ్చారు. నారా లోకేశ్‌కి దారి పొడుగునా కూడా ప్రజలు నీరాజనాలు పలికారన్నారు. ఈ నెల 22న జరగబోయే భారీ బహిరంగ సభకు రెండు లక్షల మంది వరకు హాజరయ్యే అవకాశం ఉంది అని కొల్లు రవీంద్ర తెలిపారు.ఒక చక్కటి సందేశం ఈ వేదిక ద్వారా రాష్ట్రానికి అందించబోతున్నారన్నారు. ఈ జిల్లాలో ఇద్దరు దుర్మార్గులు సైకిల్ గుర్తు పైన గెలిచి అన్న గారి కుటుంబాన్ని ఎన్నో విధాలుగా అవమానించారు అని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఇద్దరి మూర్ఖులు భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందో ఈ వేదిక ద్వారా తెలియజేస్తాం అని కొల్లు రవీంద్ర తెలిపారు.

Next Story

Most Viewed