- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భీమవరంలో హైటెన్షన్.. జెడ్పీటీసీ కృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్
దిశ, కర్నూలు ప్రతినిధి: నంద్యాల రూరల్ మండలంలోని భీమవరంలో హైటెన్షన్ నెలకొంది. నంద్యాల వైసీపీలో రోజురోజుకూ విభేదాలు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి తీరు, మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి చేసిన అభ్యంతకర వ్యాఖ్యలపై జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డి రియాక్ట్ అయ్యారు. వీరి తీరును ఎండగడుతూ జెడ్పీటీసీ నిరసనకు దిగారు. శిల్పా కుటుంబీకుల తీరును వ్యతిరేకిస్తూ జెడ్పీటీసీ దీక్షకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో గోకుల్ రెడ్డి దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు భీమవరం చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు.
అయితే కొడుకు గోకుల్ రెడ్డికి మద్దతుగా ఆయన తల్లి, గ్రామ సర్పంచ్ భక్తవత్సలమ్మ గ్రామంలోని శిబిరం వద్ద దీక్ష చేపట్టారు. ఈ దీక్షపై ఆమెను అవమాన పరుస్తూ సోషల్ మీడియాలో అవమానానికి గురి చేశారు. తన తల్లి దీక్షకు భంగపాటు కలిగించిన వ్యక్తులపై ఫిర్యాదు చేసేందుకు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎస్పీ లేకపోవడంతో వెనుగుదిరిగి వెళ్లారు. అలాగే శుక్రవారం వన్ టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.