ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలు ఇవిగో..!

by Disha Web Desk 16 |
ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలు ఇవిగో..!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ చెబుతున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపిస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సీతారామాంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అటు విజయవాడ టీడీపీ లోక్‌సభ అభ్యర్థి కేశినేని చిన్ని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ్టి టీడీపీ సమావేశానికి వచ్చిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌ను తాము పట్టుకున్నామని చెబుతున్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేతలు బోండా ఉమ, కేశినేని చిన్ని తెలిపారు.


Next Story