- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్.. ఆధారాలు ఇవిగో..!
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ చెబుతున్నారు. చంద్రబాబు, పవన్, పురందేశ్వరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ ఆరోపిస్తున్నారు. ఏపీ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ సీతారామాంజనేయులు నేతృత్వంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారని అటు విజయవాడ టీడీపీ లోక్సభ అభ్యర్థి కేశినేని చిన్ని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇవాళ్టి టీడీపీ సమావేశానికి వచ్చిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ను తాము పట్టుకున్నామని చెబుతున్నారు. అంతేకాదు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఆధారాలు ఉన్నాయని టీడీపీ నేతలు బోండా ఉమ, కేశినేని చిన్ని తెలిపారు.
ఈ రోజు టీడీపీ నిర్వహించిన వర్క్ షాప్ లో, చొరబడ్డ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ విశ్వేశ్వరరావు. ఐజీ సూచనలతో, వచ్చానని చెప్పిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్. అనుమానం వచ్చి టిడిపి నేతలు ఫోన్ చెక్ చేయగా, నివ్వెర పోయే వాస్తవాలు. ఫోన్ లోని ఒక యాప్ లో కేశినేని చిన్ని కదలికలు, మాటలను… pic.twitter.com/u8H73og8qf
— Telugu Desam Party (@JaiTDP) March 23, 2024