- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
జనసేన రిస్క్ తీసుకుని టీడీపీకి అండగా నిలిచింది: పవన్ కల్యాణ్
దిశ, వెబ్డెస్క్: ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేనాని పవన్ కల్యాణ్ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకుని తన స్థానాలను కూడా బీజేపీకి ఇచ్చి త్యాగం చేశాడు. అయితే పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పవన్ కల్యాణ్.. కాకినాడ ఎంపీ సీటును కూడా జనసేనకు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పవన్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. జనసేన రిస్క్ తీసుకుని మరీ తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిందని,, చంద్రబాబు లాంటి నాయకుడిని కావాలని వైసీపీ ప్రభుత్వం వేధించిన సమయంలో నా వంతుగా ఆయనకు కీలక సమయంలో అండగా నిలిచానని గుర్తు చేశారు. అలాగే తాను ముందుండి మూడు పార్టీలతో పొత్తును కుదిర్చానని.. మూడు పార్టీల కలివిడితనం పోలింగ్ బూతుల్లోనూ కనిపించాలని పవన్ కల్యాన్ కార్యకర్తలను దిశా నిర్దేశం చేశారు.